Tuesday, August 25, 2015

పచ్చి మృగం


_______________కృష్ణ మణి

మనిషి ఒక మృగం
మృగం కాక ఇంకేంటి
ముమ్మాటికి మృగమే !

ఒకరు చేపలను పంచారు తినడానికి
ఒకరు గొర్రెలను బలిమ్మన్నారు  
కొందరైతే  
ఏకంగా బానిసలను చేసుకొని బ్రహ్మాండంగా దర్శనమిస్తారు
ఎటుచూడు దర్జాగా !

ఒకటి మాత్రం స్పష్టం
ఏందంటే
జీవపరిణామ క్రమంలో మానవుడు
తెలివితో పాటు అహంకారాన్ని పెంచాడు
అందుకే సమస్త జీవకోటిని ఆధీనంలోకి తెచ్చుకొని
అరికాలి కింద నలుపుతున్నాడు !

ఒకటనిపిస్తుంది
అన్ని జీవులు ఒక్కటై
ఇక ఉద్యమం చెయ్యాలని తీర్మానించుకొని
హెచ్చరిక ఒకటి పంపితే

‘’అన్యాయం
అక్రమం
దొంగలని
మీలో మీరే ....
రాజ్యమని
ప్రజాస్వామ్యమని
హక్కని
నోరు తెంచుకొని రోడ్డుపై అరుస్తారే
మాకు హక్కుంది మీతో సమంగా
ఈ భూమిపై గర్వంగా
కాదంటారా ....
మరి మేము ఎదురుతిరిగి ఉద్యమిస్తే తప్పేంటి
మీకు నొప్పెంటి  
మీ లాగులోకి మేము దూరితే
ఏముతారో చెప్పము
దూరాక చూస్తారు ‘’ !

కావాలొక వాత
పైత్యం పారిపోఏదాక !


కృష్ణ మణి 

No comments:

Post a Comment