________________కృష్ణ మణి
నేనొచ్చిన కాడినుండి చూస్తున్న
లోకం ఇట్లనే ఉన్నది
ఏదైనా మారిందంటే మనిషి ఒక్కడే !
నీళ్ళు రంగు మారుస్తలేదు
చెట్టు నడుస్తలేదు
కోతి మాట్లడుతలేదు
సింహం రక్తం తాగెది మారకపాయే
బర్లు గడ్డిని మరువకపాయే!
మరి ఈ నక్కజిత్తుల దొంగ మనిషి
పూట పూటకు గుణం మారుస్తున్నడు ఊసరవెల్లోలె
ఆకలైతెనేమో అమ్మాంటడు
లేకుంటె ఇంకోటి !
ఏమిలేని కాడ
ఏ దేవుడు మాయ జేసిండో
వీనికి ఇంత తెలివి ఇచ్చిండు
వానంతల వాడుంటే మాకెందుకు ఈ లొల్లి
అందరి మీద పెద్దతనం జెయ్యవట్టే ?
నీటిని చెరవట్టిండు సిగ్గులేనోడు
గాలిని గబ్బుజేసిండు
భూమిని బష్టువట్టించిండు
అగ్గిని అదిమిపట్టి పైన కూసుండు
ఎప్పుడైనా తేడవస్తే కాలుతడు
లోకాన్ని కాలుస్తడు !
నేలమీద నిలువలేడు
ఆకాశాన్ని కూడా ఇడువలేడు
అక్కడ గిట మోతుబరి
ఓజోనుకు పొక్కలు గొట్టిండు
ఇప్పుడు ఏం దెల్వదని కండ్లు దించిండు !
నువ్వు పుట్టక ముందే పుడితిమి
కొండలం కొనలం
మా ముందే పుట్టి
మమ్మల్నే ఒంచుతున్నవురా పశువా !
ఓర్సుకుంటున్నం ఓపికున్నదాక
తర్వాత ఏమైతదో చెప్పం కోడుకా..... !
కృష్ణ మణి I