గొర్రెల మంద
______________కృష్ణ
మణి
నేనే పరాన్నజీవిని
పరాన్నబక్కు అని
కూడా అంటారు
ఏదైతే ఏందిరాబై
మంది మీద బతుకుడే
గదా
మనమందరమూ సోదరా
అవును బై
పక్కొల్లది
గుంజుకు తింటేగని నిద్రబట్టదు
అయితేంది ?
అట్లా కాదుగని
ఒక్కసారి
ఆలోచించు
సృష్టిలో
జీవులన్నీ పరాన్నజీవులు కాకుంటే ఏం జరిగేదో
ఏమయితుండేబై
సముద్రంలో చేపలు నిండి
నీళ్లన్నీ పైకొచ్చి
జమీనుని ముంచి
ఈ భూగోళం ఒక వింత
ఆకృతితో పంది మసలినట్లు ఉండేది
మనిషి ఎంతకాలమని
నీటిమీద బతుకుతడు
ఎన్నడో ఖతంయ్యేటోడు
లేకుంటే ఇప్పటికి
గుడ్డబట్ట కానక
కోతికి తాతయ్యేటోడు
నిజమే బై అట్లానన్నా
కాకపాయే
ఇని కావురం
సల్లగుండా
గుండెలల్ల ఈ
అగ్గిగోళాలు బగ్గుమని పొగలు జిమ్ముడు ఉండేవా ?
రంగుల
గుద్దులాటలుండేవా ?
నా కులమనీ
నా భాష అనీ
నా సంస్కృతి అనీ
జబ్బలు సరసుడు
ఉండేదా ?
ఈ ఓర్వజాలని
గుణాలు
పెద్దకూర
పంచాదులు ఉండేవా ?
ఆడమగ తేడాలు
కట్నం సావులు
కనికరం లేని
కసాయిల షికారులు ఉండేవా ?
మతం గొప్పలు
పీఠం తిప్పలు
తేరని అప్పులు
ఈ దగ్గులు తుమ్ములు
దావఖాన జబ్బులు
ఉండేవా ?
మతమంటే
అనిపిస్తుంది
కనీసం మనిషికి
మతం పిచ్చన్న లేకున్నా
అసలు మతమనేది
లేకున్నా చరిత్ర ఎట్లుండేదో ?
జీవులు
పరాన్నబక్కులైనా ఏమిగాలేదు కాని
మనిషికి
అహంకారమనే విషాన్ని చిమ్మకున్నా బాగుండేది
చలో బై సాబ్
యాదిజేసి మనసుకాలవెట్టినవు
చాయి తాపియ్యి నడువు
కృష్ణ మణి