Friday, December 19, 2014

గాంధి నడిచిన నేల


________________________కృష్ణ మణి

‘’గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు ప్రతి రూపం ‘’ 
అని చిన్నప్పుడు పాడిన పాట !

గతం తియ్యగానే ఉంటుంది ఈనాటి చేదు ముందు
గాంధి కల నిజమయ్యేది ఎప్పుడు ?
ఆకాశంలో చుక్కలు
పూల రెక్కలుగా రాలి మన కళ్ళను మురిపించేదెన్నడు ?

పడతి పగలు నడువడమే ఒక పాపంలా
పొడచూపే కామ కత్తుల మెరుపుల వలలు
ఇక ఎన్నడు వచ్చును రామ రాజ్యం
ఎన్నడు మారును పశు అహంకారం ?

బీదవాడు బీదోడే ఉన్నవాడు ఉన్నోడే
సమ సమాజం అంటే
భూమ్మీద ధనవంతుని ఇంటి పక్కన గుడిసెలో బ్రతకటమే !

పాలలో విషం నింపి పేషంట్లుగా మార్చగ
కార్పొరేట్ హాస్పిటల్ లో రోగాలకు ట్రీట్మెంట్ కి వెళ్తే
చచ్చినోడికి పరీక్షలు చేసి లక్షలు పోస్తేగాని శవాన్ని ఇవ్వరే !

వర్ణ వివక్షత వల్ల ఆనాడు స్వరాజ్యం కోసం బీజం పడితే
స్వరాజ్యంలో మతఘర్షణలకు బీజాలు వేశారు
వారసులమని చెప్పుకొనేవాళ్ళు
ఇంతకీ వీరు ఎవరి వారసులు తెల్లవాల్లకా లేక గాంధీ గారికా !

తెల్లచొక్క వేసేవాల్లందరూ ఒకప్పుడు నాయకులు
ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకులు
ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు !


కృష్ణ మణి I 02-10-2014  

No comments:

Post a Comment