పిశాచ వల
_________________కృష్ణ మణి
మనిషి మనిషిగా గుర్తించని మూర్ఖుల మధ్య
కులమని
మతమని ఏడిచి చచ్చే
పిచ్చి మతుల మధ్య నిలబడి
ఏం సాదిద్దామని ఈ ఆరాటం
మనిషిని చంపటమే ధ్యేయమని
మనిషికి భయాన్ని రుచి చూపించి
లొంగదీసుకొని ఒక వర్గం చాందసాన్ని లోకానికి రుద్దడమంటే
నీది ఎంతటి కటువైన మనసు !
రాయి అయినా కరుగుతుందేమో అగ్ని పర్వతం బద్దలైనప్పుడు !
కాని , నీ మనసెందుకు ఇంతలా ముదిరింది
ఎవరు చెప్పారో చెప్పు
ఎతికి అడుగుతా లోకం చుట్టి
ఎక్కడ రాసుందో చెప్పు కనీసం
మత గ్రంధాలను తిరిగేస్తా
నీ దాష్టికానికి మూలమేదో తేలుతుంది
తలను కోసే నిన్ను మనిషివని నేననుకోను
మత్తులో జోగే చలనం లేని మెదడుతో నీవు
ఎంతటి దుర్మార్గానికైన వెనకాడవని తెలుస్తుంది
నువ్వు మారుమని నేనడగను
అడుగమంటే మాత్రం చావమంటాను
అవును ముమ్మాటికి చావమంటాను
మానవత్వం బతుకుతుందని మెరిసిపోతాను
ఈ భూమికి భారం తగ్గుతుందని మురిసిపోతాను
కృష్ణ మణి
No comments:
Post a Comment